KRNL: మహిళల సాధికారత విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని, ఆ పార్టీ మహిళా వ్యతిరేకి అని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పేర్కొన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు అధికారంలో ఉండి కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ఇప్పుడు రాజ కీయ నాటకాలు ఆడుతోందని విమర్శించారు.