KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్ఎంఎటి కాలనీలో సీపీఐ ఆధ్వర్యంలో గడపగడపకు కార్యక్రమం శనివారం 7వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా నేతలు టిడ్కో గృహాలను ఈ ఉగాది నాటికైనా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలు విరివిగా విరాళాలు ఇచ్చి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో CPI పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.