PLD: క్రోసూరు:కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీల అభ్యున్నతి కోసం CPI పార్టీ పనిచేస్తుందని నియోజకవర్గ CPI కార్యదర్శి మునుగోటి శ్రీనివాసరావు తెలిపారు. మార్చి ఒకటి నుంచి 15 వరకు మండలంలో గడపగడపకు CPI కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంతో పోరాడి పరిష్కరిస్తామని ఆయన అన్నారు.