KKD: శంఖవరం మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేకెత్తిస్తోంది. గత 15 రోజులుగా పోలవరం, కాకినాడ జిల్లాల పరిధిలో పలు ప్రాంతాల్లో తిరిగిన పులి రాత్రంతా స్థిరంగా ఒకే ప్రాంతంలో ఉండడంతో అధికారులు అప్రమత్తమై ప్రత్యేక నిఘా పెట్టారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల రహదారులు తాత్కాలికంగా మూసివేసి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. పులి పట్టుబడే వరకు ప్రజలు సహకరించాలన్నారు.