E.G: ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామం నందు శ్రీ గౌరీశ్వర స్వామి వారి నూతన ఆలయ పునఃనిర్మాణానికి మంత్రి కందులు దుర్గేష్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.