BPT: మార్టూరు మండలం కొలలపూడి గ్రామంలో శనివారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్వింటా శనగలకు ప్రభుత్వం రూ. 5,875 మద్దతు ధర కల్పిస్తోందని తెలిపారు. రైతు స్వరాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగుతోందని, అన్నదాతల ఆర్థికాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.