PLD: విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా రేపు శనివారం మండలంలో విద్యుత్ కోత జరుగుతుందని ఏఈ రవికిరణ్ తెలిపారు. ఈదురు గాలులు అకాల వర్షం కారణంగా కొన్ని ప్రదేశాల్లో లైన్లు మరమ్మతులకు వచ్చాయని, పరిశీలన చేపడుతున్నామన్నారు. కరెంటు తీగల కింద పెరిగిన చెట్లను తొలగించనున్నట్లు చెప్పుకొచ్చారు. విద్యుత్ వినియోగదారులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని పేర్కొన్నారు.