చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం భూమిరెడ్డిపల్లి పంచాయతీలోని జన్నావాలామిట్ట, వెంకటాపురం గ్రామాలలో వీధి దీపాలు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో చీకటిలో ప్రయాణించాల్సి వస్తోంది. మెయిన్ రోడ్డు నుంచి గ్రామం వరకు చీకటిగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.