ELR: దెందులూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదివారం వినతులు అందజేశారు. సమస్య ఏదైనా సరే, పరిష్కారం కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.