KRNL: కర్నూలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.రుద్రవరం సమీపంలో గల కేసీ కాలువలో ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని అదే గ్రామానికి చెందిన మౌలాలి (35)గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.