ASR: జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి విస్తరణ, అనుసంధాన రహదారుల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ నిషాంతి అధికారులను ఆదేశించారు. ఆదివారం జీ.మాడుగుల మండలంలో పర్యటించి, జాతీయ రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. జీ.మాడుగుల నుంచి ఉరుము జంక్షన్ వరకు, డీ.గొందూరు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.