సత్యసాయి: కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి. 28న కల్యాణోత్సవం, మార్చి 10న ప్రధాన ఘట్టమైన తేరు నిర్వహించనున్నారు. ప్రహ్లాద సమేతుడై కొలువుదీరిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. మార్చి 13న పుష్పయాగంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.