GNTR: ఆటో కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని AITUC జిల్లా ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తపేటలో జరిగిన ఆటో స్టాండ్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణాల వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లు, ఇప్పుడు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ కష్టపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.