సత్యసాయి: ఏబీఎన్ రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ గురువారం పెనుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీకెండ్ కామెంట్ కార్యక్రమంలో వైఎస్ జగన్, పార్టీ కార్యకర్తలపై అత్యంత అవమానకర, అసత్య వ్యాఖ్యలు చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.