ASR: హుకుంపేట మండలం ములియాపుట్టు పంచాయతీలో శుక్రవారం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జోగులపుట్టు గ్రామంలో రీ-సర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన 41 కొత్త పాసు పుస్తకాలను ఆర్డీవో లోకేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు.