PPM: మన్యం పట్టణంలో సోమవారం (ఇవాళ) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. స్దానికుల వివరాల ప్రకారం.. స్దానిక అగ్రహారం వీధి మెయిన్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గంటా రామకృష్ణ ని లారీ ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.