W.G: పాలకొల్లు రూరల్ నాగరాజుపేటలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొనేందుకు రాగా, అక్కడ తనను కలిసిన అంగన్వాడీలతో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 58,204 మంది సిబ్బందికి రూ. 75 కోట్లతో 5జీ స్మార్ట్ ఫోన్లు అందజేసినట్లు మంత్రి చెప్పారు. పాలకొల్లు నియోజకవర్గంలో రూ. 5.80 కోట్లతో R&బీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.