ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘మీ కోసం-ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని కోరారు. వీటిని ఆన్లైన్ ద్వారా నమోదు చేసి, నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.