SKLM: కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణంలో ఉన్న అన్న క్యాంటీన్ను శనివారం మధ్యాహ్నం ఏపీటీపీసీ ఛైర్మన్ బాబురావు సందర్శించారు. అనంతరం పలాస టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సప్ప నవీన్తో కలిసి ఆయన భోజన రుచిని పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం ఐదు రూపాయలకే పేదవాడికి కడుపునిండా భోజనం కూటమి ప్రభుత్వంలో తిరిగి ప్రారంభించామని తెలిపారు.