VSP: విశాఖపట్నం నుంచి భవానిపట్నంకు వెళ్లే ప్యాసింజర్ రైలు (58504) బుధవారం గంట ఆలస్యంగా నడవనుంది. సాధారణంగా సాయంత్రం 6 గంటలకు బయలుదేరే ఈ రైలు, సాంకేతిక కారణాల వల్ల 7 గంటలకు బయలుదేరేలా రీ షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను సవరించుకోవాలని, రైల్వే శాఖకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.