NDL: కొత్తపల్లి గ్రామ సమీపంలో నంద్యాల -ఆత్మకూరు రహదారిపై సోమవారం ఆర్టీసీ బస్సు పల్సర్ బైక్ను ఢీకొనడంతో విశ్వ నగర్కు చెందిన నాగరాజు(43) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మకూరు వైపు వేగంగా వెళ్తున్న బస్సు బైక్ను ఢీకొట్టిందని తాలూకా పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.