కృష్ణా: గుడివాడ బేతవోలులో నిర్వహించిన ‘జనసేన ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, గ్రామ స్థాయి నుంచి ఉద్యమి సభ్యత్వాలను విస్తృతంగా నమోదు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పాల్గొన్నారు.