NTR: మైలవరం నియోజకవర్గంలోని పలువురు మృతుల కుటుంబాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శనివారం పరామర్శించారు. రెడ్డిగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గుడిపూడి వెంకట నారాయణ ఇటీవల మృతి చెందారు. ఆయన చిత్రపటానికి పుష్పములు సమర్పించి శ్రద్దాంజలి ఘటించారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటని వ్యాఖ్యానించారు.