ATP: గుత్తి మండలం రజాపురం గ్రామంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు మార్చి 1న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నాగజ్యోతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్ ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావాలన్నారు.