CTR: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులకు రాయితీపై పంపిణీ చేసేందుకు 27 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు వ్యవసాయ శాఖ జేడీ మురళీ తెలిపారు. ఈ సీజన్లో 88,095 ఎకరాల్లో వేరుశనగ సాగు కానున్నట్లు అంచనా వేశామన్నారు. మే రెండో వారంలో విత్తనాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.