ATP: గుంతకల్లులో ఈ నెల 20 తేదీన జరిగే జగత్ జ్యోతి శ్రీ గురు బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వీరశైవ సంఘం అధ్యక్షుడు విరుపాక్షి రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. ఈ పూజా కార్యక్రమానికి ఉరవకొండ గవి మఠం ఉత్తరాధికారి కర్రీ బసవ రాజేంద్ర ప్రసాద్ స్వాముల వారు హాజరవుతారన్నారు. సోమవారం సాయం కాలం 4 గంటలకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు.