ATP: బాణాసంచా పేలుడు ఘటనలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ, ఈ ప్రమాదం ప్రభుత్వ వైఫల్యమని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు పోతుల నాగరాజు విమర్శించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. బాణాసంచా తయారీ కేంద్రాలను తక్షణమే మూసివేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.