W.G: ఉపాధి హామీ పథకం కార్మికులకు ముఖ ఆధారిత మస్తర్ విధానాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు డిమాండ్ చేశారు. ఇవాళ తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో ఉపాధి హామీ పని ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ముఖ ఆధారిత మస్తర్ విధానం వల్ల కూలీల కళ్లు సరిగా స్కాన్ కావడం లేదన్నారు. దీంతో నిరాశతో కూలీలు వెనుతిరుగుతున్నారన్నారు.