కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో వ్యాపారులతో కమిషనర్ మనోహర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్లను తక్షణమే రెన్యువల్ తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్కు కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వం నిబంధనల ప్రకారం 25% పెనాల్టీ విధిస్తామన్నారు.