ASR: పిల్లల్లో పోషణ, ఎదుగుదల, మెదడు అభివృద్ధిపై దృష్టి సాధించాలని కొయ్యూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో ఎల్.దేవమణి అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం రాజేంద్రపాలెం సెక్టార్ పరిధిలోని రేవళ్ల గ్రామ సచివాలయంలో 8వ ‘పోషణ పక్వాడ’ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు స్థానికంగా లభ్యమయ్యే పౌష్టికాహార విలువలు గురించి అవగాహన కల్పించాలన్నారు.