ELR: చేపలు గుడ్లు పెట్టే కాలం నేపథ్యంలో మత్స్యకారులు వేటకు ప్రభుత్వం 61 రోజుల పాటు నిషేధం విధించింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. ఏలూరు జిల్లాలోని కొల్లేరు పరిధిలోని 28 గ్రామాల్లో 12,402 మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. 129 మెకనైజ్, 290 నాన్ మెకనైజ్ బోట్లతో చేపల వేట చేస్తున్నారు.