GNTR: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న కాకుమాను మండలం కొండపాటూరులోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈఓ శ్రీనివాస్ ప్రకటించారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఆలయ ద్వారాలు మూసివేస్తామని, మరుసటి రోజు బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం తిరిగి దర్శనానికి అనుమతిస్తామని ఆయన తెలిపారు. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆలయ కమిటీ కోరింది.