ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణతో కలిసి నారాయణపురం – నాగిరెడ్డిపల్లి వంతెనను ప్రారంభించారు. సుమారు రూ. 4.79 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జి వల్ల 15 గ్రామాల ప్రజల 40 ఏళ్ల నాటి సమస్య పరిష్కారమైంది. గతంలో వంతెన లేక ప్రజలు పది కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేదని ఎమ్మెల్యే తెలిపారు.