కోనసీమ: అయినవిల్లి మండలం క్రాపలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోటిపల్లి రాజారావు (47) బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు దిగుడుబావిలో పడి మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసింది. మృతునికి భార్య మాణిక్యం, కుమార్తె ఉన్నారు. అయినవిల్లి ఎస్సై కే జ్యోతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజారావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.