W.G: పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువులో శుక్రవారం ‘ఫ్రైడే -డ్రై డే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నిల్వ ఉన్న నీటిని తొలగించి, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. దోమల వ్యాప్తి ద్వారా వచ్చే డెంగీ, మలేరియా వంటి విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.