ASR: అరకులోయ మండలంలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలు, రోగులకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించారు. PHCలో ఉన్న పలు సమస్యలను తెలుసుకుని, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.