సత్యసాయి: చేనేత కార్మికుల సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేశ్ తీసుకెళ్లారు. సుమారు రూ.220 కోట్ల ఆప్కో బకాయిలు చెల్లించాలని, ఎన్నికల హామీ మేరకు కార్మికులకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు.