CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ కోనేటి వద్ద వెలిసిన శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి పెద్ద శేషు వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు విహరించారు. స్వామి వారి ముందు ప్రత్యేకంగా కోలాటాలు, చెక్క భజనలు, కీర్తనలు గోవింద నామాలతో వాయిద్యాలతో భక్తులకు కనువిందు చేశారు.