KKD: మత్స్య సంపద పెంపు కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. అద్దరిపేట నుంచి అంతర్వేది వరకు 170 కిలోమీటర్ల పరిధిలోని మత్స్యకారులు ఈ వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. నిషేధ సమయంలో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మత్స్యకారులకు రేషన్ పంపిణీ చేయనుంది. మత్స్య సంపద పునరుత్పత్తికి సహకరించాలని అధికారులు తెలిపారు