GNTR: 2027 జనాభా లెక్కల సేకరణపై గుంటూరులో అధికారులకు శిక్షణ ఇచ్చారు. జేసీ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కలు సేకరిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందన్నారు. ఎన్యుమరేటర్లు మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వాలని సూచించారు.