సత్యసాయి: నేరాల అదుపునకు డ్రోన్లు, సీసీ కెమెరాల వాడకంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సీకే పల్లికి చెందిన దాత రామ్మూర్తి గురువారం రూ.7 లక్షల విలువైన 49 సీసీ కెమెరాలు, సోలార్ ప్యానళ్లు, సిమ్ కార్డులను అందజేశారని ఆయన తెలిపారు. వీటిని జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసి, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.