BPT: చీరాల ఎమ్మెల్యే కొండయ్యపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆరోపిస్తూ కూటమి శ్రేణులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఆర్ఓబీ (ROB) నిర్మాణంపై వాస్తవాలను వక్రీకరించారని మండిపడుతూ సాక్షి పత్రిక ప్రతులను చించివేశారు. 2014-19 మధ్యే అనుమతులు వచ్చినా, ఆ తర్వాతి నిర్లక్ష్యం వల్లే పనులు ఆగిపోయాయని,ప్రజల సమస్యల కోసమే ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడారని తెలిపారు.