మన్యం: పాలకొండ-లుంబూరు మధ్య ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారింది. రహదారిపై రాళ్లు తేలిపోవడంతో ప్రయాణం కష్టంగా మారి, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణానికి నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు, అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.