GNTR: గుంటూరు నగరపాలక సంస్థ (GMC) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కమిషనర్ కె. మయూర్ అశోక్ ఓప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. నగర వాసులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.