ATP: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఆదివారం పాల డైరీలను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలో ఇటివల కల్తీ పాల ఘటన వెలుగు చూడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ తస్లీమ్ ఆధ్వర్యంలో సిబ్బంది అనంతపురంలోని 6 డైరీలను తనిఖీ చేసి శాంపిల్ సేకరించారు. పరిశుభ్రత లేకుండా నిల్వ ఉంచిన పాలను పారద్రోలించారు.