TPT: రేణిగుంట(మం) ఆర్. మల్లవరం పంచాయతీలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతన్నలను కలిసి, వారితో మాట్లాడారు. సాగు నీరు, విత్తనాలు, ఎరువుల సరఫరాపై రైతులకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు.