CTR: జిల్లాలో పోలీసులు “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, రోడ్డు భద్రత వంటి అంశాలపై ప్రజలకు సూచనలు అందించారు. ప్రజల సహకారంతో గ్రామాలను సురక్షితంగా మార్చడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు.