VZM: కొత్తవలస మండలం చింతలపాలెంలో ఉపాధి హామీ నిధులతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శుక్రవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును పరిశీలించి నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.