AP: మార్కాపురంలో భూ సమస్యలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ప్రజల భూములు 22A కింద పెట్టి.. ఇబ్బందులు పెట్టారు. గతంలో జగన్ ఫొటోలతో పట్టాదారు పాస్బుక్కులు ఇచ్చారు. నేను వచ్చాక ప్రభుత్వ రాజముద్రతో పాస్బుక్కులు ఇస్తున్నాం. కలెక్టర్లు, రెవెన్యూవారికి ఏడాది సమయం ఇచ్చా. పేదల భూ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది’ అంటూ హామీ ఇచ్చారు.