KRNL: ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా బండ్లపల్లిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పెద్దకడబూరు మండలం సీపీఐ నాయకులు బయలుదేరారు. CPI జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదలు, రైతులకు అండగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తుందని ఆరోపించారు.